పదవీవిరమణ పొందిన ఉద్యోగుల బకాయిల చెల్లింపు గడువు పెంపు
విశ్రాంత ప్రభుత్వోద్యోగుల బకాయిలు చెల్లించే గడువు పది వారాల నుంచి 12 వారాలకు పెంచాలని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సోమవారం నుంచి అమలు చేయడానికి న్యాయస్ధానం అంగీకరించింది. ప్రభుత్వోద్యోగిగా పదవీ విరమణ పొందిన వెంటనే తరువాత రావాలసిన బెనిఫిట్లు యాడాదైనా రాకపోవడంతో పలువురు విశ్రాంత ఉద్యోగులు తమ బకాయిలు చెల్లించాలంటూ ప్రభుత్వంపై కోర్టులో కేసులు వేస్తున్నారు. ప్రతి రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా డజన్ల సంఖ్యలో కోర్టులో పిటీషన్లు వేస్తున్న రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ కి తెలంగాణ హైకోర్టు చేదు నిర్ణయం వెలువరించంది. ఎప్పటిలాగే సోమవారం తన ముందుకు వచ్చిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల పిటీషన్లపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ఇరుపక్షాల వాదనలను విన్నారు. ప్రభుత్వం దగ్గర నిధుల కొరత తీవ్రంగా ఉన్నందున బకాయిలు చెల్లింపు కోసం గడవును 12 వారాలకు పెంచాలని ప్రభుత్వ న్యాయవాది న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. అయితే విశ్రాంత ఉద్యోగుల తరపున వాదిస్తున్న న్యాయవాది ఈ అభ్యర్ధనను తీవ్రంగా వ్యతిరేకించారు. గడువు పొడిగిస్తే విశ్రాంత ఉద్యోగులకు నష్టం జరుగుతుందని వాదించారు. రిటైర్మెంట్ బకాయిల చెల్లిపు విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక హక్కు అని, ఉద్యోగుల తరపు న్యాయవాదులు కోర్టుని అభ్యర్థించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వర రావు గారు ఈ వారం శుక్రవారంలోగా తన ముందుకు విచారణకు వచ్చిన కేసులకు మాత్రం గతంలో మాదిరిగానే బకాయిల చెలింపునకు 10 వారాల గడువు ఆదేశిస్తానని న్యాయమూర్తి స్పష్టం చేశారు. వచ్చే సోమవారం నుంచి మాత్రం తన ముందుకు వచ్చే కేసులలో ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని గడువుని 12 వారాలకు పెంచుతామని న్యాయమూర్తి స్పష్టం చేశారు.