తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జూలై 17న రైలురోకో

బీసీ రిజర్వేషన్ల సాధనకోసం రైలురోకో- ఎమ్మెల్సీ కవిత;

Update: 2025-06-17 11:40 GMT

బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చే క్రమంలో జూలై 17వ తేదీని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం రైల్‌ రోకో కార్యక్రమం నిర్వహించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతితో పాటు యూపీఎఫ్‌ ల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం బీసీ రౌండ్ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ అన్ని బీసీ సంఘాల నాయకులను కలుపుకుని ఉద్యమిస్తామని ప్రకటించారు. ఢిల్లీ పాలకులకు తాకేలా రైల్‌ రోకో కార్యక్రమం ఉంటుదన్నారు. 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుడానే స్థానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడానికి తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని ప్రకటించారు. కనీసం వార్డు మెంబర్‌, సర్పంచులు కూడా కాని అనేక కులాలు ఉన్నాయని కవిత తెలిపారు. సరైన సమయంలో జాగృతి మాట్లాడింది కాబట్టే అసెంబ్లీలో మూడు బిల్లులు వచ్చాయని చెప్పారు. అదే స్పూర్తితో బీసీ బిల్లు కేంద్రం ఆమోదించే వరకూ పోరాడతామని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించన కులగణన వివరాలను గ్రామ పంచాయితీల వారీగా ప్రకటించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.

Tags:    

Similar News