Speaker Gaddam Prasad Kumar: ఎమ్మెల్యే దానం అనర్హత పిటిషన్పై 30న స్పీకర్ విచారణ
30న స్పీకర్ విచారణ
Speaker Gaddam Prasad Kumar: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై దాఖలైన అనర్హత పిటిషన్పై తెలంగాణ శాసనసభ స్పీకర్ గద్దం ప్రసాద్ కుమార్ ఈ నెల 30న విచారణ జరపనున్నారు. ఈ మేరకు విచారణ షెడ్యూల్ను స్పీకర్ గారు నిర్ణయించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్కు విచారణకు హాజరు కావాలని స్పీకర్ నోటీసు జారీ చేశారు. అలాగే పిటిషనర్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మరియు సంబంధిత న్యాయవాదులకు కూడా హాజరు కావాలని నోటీసులు పంపారు.
బీఆర్ఎస్ తరపున దాఖలైన అనర్హత పిటిషన్పైనా అదే రోజు విచారణ జరగనుంది. ఇందులో పిటిషనర్ల తరఫున సాక్ష్యాలను స్పీకర్ నమోదు చేయనున్నారు. అదనంగా భాజపా ఎమ్మెల్యేల ఫ్లోర్ లీడర్ ఏ. మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన మరో అనర్హత పిటిషన్పై కూడా జనవరి 30నే విచారణ జరుగుతుంది.
దానం నాగేందర్ బీఆర్ఎస్ తరపున ఎన్నికైన ఎమ్మెల్యే అయినప్పటికీ, ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనర్హత పిటిషన్లు దాఖలు అయ్యాయి. దీనిపై ఆయన తరపున అఫిడవిట్ దాఖలు చేసినట్లు సమాచారం.
ఈ విచారణ ఫలితం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.