Stephen Raveendra: తెలంగాణలో ఇంధనాల కొరత లేదు.. ప్రజలు వదంతులకు లోనవద్దు: స్టీఫెన్ రవీంద్ర

ప్రజలు వదంతులకు లోనవద్దు: స్టీఫెన్ రవీంద్ర

Update: 2026-03-26 12:50 GMT

Stephen Raveendra: తెలంగాణలో పెట్రోల్‌, డీజిల్‌, ఎల్‌పీజీ సరఫరాల్లో ఎలాంటి కొరత లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర స్పష్టం చేశారు. పెట్రోల్‌ బంకుల వద్ద ఇటీవల ఏర్పడిన రద్దీ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఇంధన నిల్వలపై పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చి వివరాలు అందించారు.

“ఎప్పటికప్పుడు పరిస్థితిని సన్నిహితంగా పర్యవేక్షిస్తున్నాం. రాష్ట్రంలో ఇంధనాల సరఫరా సాఫీగా ఉంది” అని స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. సోషల్‌ మీడియాలో వ్యాప్తి చెందుతున్న నిరాధారమైన వదంతులు చూసి ప్రజలు ఆందోళన చెందవద్దని కూడా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఇంధనాలు సకాలంలో సరఫరా అవుతున్నట్లు అధికారులు ధృవీకరించారు. ప్రజలు సాధారణంగా పెట్రోల్‌ బంకులు, ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్దకు వెళ్లి అవసరమైన ఇంధనాలు కొనుగోలు చేయవచ్చని సూచించారు.

Tags:    

Similar News