Ex Minister Harish Rao : కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపండి

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాసిన మాజీ మంత్రి హరీష్‌ రావు;

Update: 2025-08-13 07:29 GMT

వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపాలంటూ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. ప్రాజెక్టు పరిధిలో వివిధ జిల్లాలోని రిజర్వాయర్లు మిడ్ మానేరు, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్ లను నింపి సుమారు 5లక్షల ఎకరాల ఆయకట్టు పరిధిలోని రైతుల ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్యాకెజ్-6 వద్ద గల మోటార్లను ఆన్ చేసి నీటి పంపింగ్ చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత వానాకాలం పంట సీజన్ లో ఇటు వర్షాభావం, అటు ప్రాజెక్టుల్లో రిజర్వాయర్ లలో నీటిని సకాలం లో నింపక పోవడం ద్వారా పంటల సాగు ముందుకు పోక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని హరీష్‌రావు లేఖలో పేర్కన్నారు. ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వలన వచ్చే ప్రతి నీటి చుక్కని ఒడిసి పట్టడం కోసం సకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ లను ఆన్ చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు హరీష్‌ రావు పేర్కొన్నారు.

అదేరకంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వలన గోదావరిలో ఇన్ ఫ్లో పెరిగిందని తెలిపారు. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ప్యాకెజ్ -6 వద్ద గల నంది పంప్ హౌస్ లోని మోటార్లను ఆన్ చేసి నీటి పంపింగ్ ప్రారంభించి తద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మిడ్ మానేరు, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ తదితర రిజర్వాయర్ లను నింపాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. ఆయా రిజర్వాయర్ల పరిధిలోని చెరువులను, చెక్ డ్యామ్ లను అన్నింటిని నింపి సుమారు 5లక్షల ఎకరాల కు నీరందించేలా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నీటి పంపింగ్ చేపట్టాలని హరీష్‌రావు మంత్రి ఉత్తమ్‌ని లేఖలో కోరారు. రిజర్వాయర్ లలో నీటిని సకాలం లో నింపక పోవడం వల్ల పంటల సాగు ముందుకు పోక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని హరీష్ రావు మంత్రికి రాసిన లేఖలో వివరించారు.

Tags:    

Similar News